బాబాయ్-అబ్బాయ్... అచ్చెన్నను కలిసినప్పటి ఫొటో పంచుకున్న రామ్మోహన్ నాయుడు

  • విజయవాడలో టీడీపీ నేతల భేటీ
  • హాజరైన అచ్చెన్న, రామ్మోహన్ నాయుడు
  • ట్విట్టర్ లో స్పందించిన రామ్మోహన్
  • అచ్చెన్న పట్ల గర్విస్తున్నానని వెల్లడి
ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఆ పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇవాళ విజయవాడ టీడీపీ కార్యాలయంలో సందడి చేశారు. రామ్మోహన్ నాయుడుకు అచ్చెన్న బాబాయ్ అవుతారన్న సంగతి తెలిసిందే. విజయవాడ వచ్చిన సందర్భంగా రామ్మోహన్ నాయుడు ట్విట్టర్ లో స్పందించారు.

ఇవాళ విజయవాడ టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు గారిని కలుసుకున్నానని వెల్లడించారు. పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలతో కలిసి ఆయన చేస్తున్న కృషి చూసి ఎంతో గర్వంగా అనిపించిందని తెలిపారు. ఈ సందర్భంగా తన బాబాయ్ అచ్చెన్నతో కలిసిన ఫొటోను రామ్మోహన్ పంచుకున్నారు. ఆ ఫొటోలో బాబాయ్-అబ్బాయ్ చిరునవ్వులు చిందిస్తుండడం చూడొచ్చు.

Kinjarapu Ram Mohan Naidu
Atchannaidu
Vijayawada
TDP

More Telugu News